logo

ఈసీ పరిధిలో ఉన్నామని పోలీసులు గుర్తించాలి: బొండా ఉమ



AP: కొందరు పోలీసులు వైసీపీకి కొమ్ము కాస్తున్నారని
టీడీపీ నేత బొండా ఉమ ఆరోపించారు. 'తాడేపల్లి
ప్యాలెస్ ఆదేశాలతో నన్ను అక్రమ కేసులో ఇరికించే
ప్రయత్నం చేసిన CPపై EC తీసుకున్న చర్యలు చూసైనా
ఇతర అధికారుల్లో మార్పు రావాలి. తాము ఈసీ
పరిధిలో ఉన్నామని గుర్తించాలి. విజయవాడ సెంట్రల్లో
ఏసీపీ, సీఐలు వెల్లంపల్లి కనుసన్నల్లో నడుస్తున్నారు.
వీరిపైనా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరుతాం' అని
ఆయన వెల్లడించారు.

0
0 views